నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరుదైన గుర్తింపు దక్కించుకున్నారు. ఒకేరోజు రికార్ఢు స్థాయిలో శంకుస్థాపనలు చేసి వార్తల్లోకి ఎక్కిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇప్పుడు ఒకే సమయంలో 339 అభివృద్ధి పనులను ప్రారంభించి మరో ఘనత అందుకున్నారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఆయనకు ప్రశంసా లేఖను పంపారు. దీనికి స్పందిస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు.