తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి సమాచార హక్కు చట్టం కింద ఉచితంగా సమాచారం అందించాలని స్పష్టం చేసింది. రుసుము వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. చట్టంలోని సెక్షన్ 7(5) ప్రకారం పేదలకు ఉచితంగా సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.