తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంలో రాయితీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. పాత ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలకు మరో అవకాశం కల్పించారు. మునుపటి రాయితీపై ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఆశించిన మేర పౌరులు ఎక్కువగా స్పందించలేదు. సాంకేతిక సమస్యలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రాయితీ గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది. ఇప్పటి వరకు 4 లక్షల మంది దరఖాస్తుదారులు రూ.1200 కోట్ల వరకు ఫీజు చెల్లించారు.