ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడతలో 11 వేల 400 ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేయగా.. మిగిలిన 44 వేల 346 ఇండక్షన్ స్టవ్లను అంగన్వాడీ కేంద్రాలకు వీలైనంత త్వరగా అందించాలని ఏపీ ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ను ఆదేశించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఇబ్బందులు రాకుండా ఈ చర్యలు చేపట్టింది.