హైదరాబాద్లో బోనాలు, మొహర్రం వేడుకల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 478 మంది పోకిరీలను షీ టీమ్స్ పట్టుకున్నాయి. పట్టుబడిన వారిలో మైనర్లు, వృద్ధులు అధికంగా ఉన్నారు. షీ టీమ్స్ రహస్య కెమెరాల ద్వారా నిఘా వేసి వీరిని గుర్తించాయి. 288 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెట్టగా, ఐదుగురికి జరిమానా విధించారు, ఒకరికి జైలు శిక్ష పడింది. సహాయం కోసం షీ టీమ్స్ను సంప్రదించవచ్చు. పూర్తి వివరాల కోసం ఇది చదవండి