ఆంధ్రప్రదేశ్లో సంచారజాతిగా ఉన్న బుడగ జంగం కులాన్ని ఎస్సీలలో చేర్చాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై గురవారం జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఎస్సీ వర్గీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరోవైపు బుడగ జంగాలను ఎస్సీలలో చేర్చాలని 2019, 2023లోనూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఆ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం లభించలేదు.