ఏ++ గ్రేడ్ కోసం ‘న్యాక్’ కమిటీకి లంచం.. కేఎల్ వర్సిటీపై సీబీఐ కేసు

1 year ago 26
గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదు కావడం కలకలం రేగుతోంది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) రేటింగ్స్ కోసం కేఎల్‌యూ యాజమాన్యం అడ్డదారులు తొక్కిందనేది ప్రధాన ఆరోపణ. తనిఖీ కమిటీకి లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదుచేసింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 20 చోట్ల సీబీఐ శనివారం నుంచి సోదాలు జరిపింది. ఈ క్రమంలో నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
Read Entire Article