ఏం నాయనా.. మందు కొట్టి కొండ పైకెళ్లి గుండు చేయించుకుంటావా?: భూమన

9 months ago 15
Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిని కూటమి ప్రభుత్వం మద్యం మత్తులో ముంచేస్తోందని వైసీపీ నేత భూమన అభియన్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు) మండిపడ్డారు. ఆదివారం (మే 18) ఉదయం తిరుపతిలో ఆయన రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న నైన్ స్టార్ వైన్స్ మద్యం దుకాణంలో ఉదయం 10 గంటల కంటే ముందే మద్యం అమ్మకాలు జరగడాన్ని ఆయన గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా రోజూ ఉదయం 5 గంటలకే మద్యం షాపు ఎందుకు తెరుస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్‌లు పెట్టి బార్ల మాదిరిగా నడిపిస్తున్నారని అభినయ్ రెడ్డి ఆరోపించారు. అభినయ్ రెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వైన్ షాపు‌లో కొన్ని మద్యం సీసాలను పగలగొట్టారు.
Read Entire Article