వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం 7 గంటలకు సభకు హాజరై ప్రసంగించారు. సభ ప్రారంభంలోనే కార్యకర్తల నినాదాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాసేపు మౌనంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ను నెంబర్ వన్ విలన్గా విమర్శిస్తూ.. తెలంగాణ ప్రజలను మోసగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.