Hyderabad SI Gold Chain Stolen In RTC Bus:హైదరాబాద్లో ఓ విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఎస్సై మెడలోంచి తులం బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి కొట్టేశాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రు నాయక్ అనే ఎస్సై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లక్డీకాపూల్లో బస్సు ఎక్కిన తర్వాత అసెంబ్లీ వద్ద గొలుసు పోయినట్లు గుర్తించారు. సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.