Pithapuram Sunflower Oil Lorry Theft: కాకినాడ జిల్లాలో లారీ చోరీ ఘటన కలకలం రేపింది. డెయిరీ ఫారమ్ సెంటర్కు చెందిన అప్పారావు లారీని భువనేశ్వర్కు పంపేందుకు పిఠాపురంలో పార్క్ చేసి తాళం డ్రైవర్ రమణకు ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం చూస్తే లారీ కనిపించకుండా పోయింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద గుర్తించారు. తుని వద్ద లారీని వదిలి ఆయిల్ ప్యాకెట్లు దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.