AP High Court AGPS Salary 25% Hiked: ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఏజీపీలకు గౌర వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు ఏజీపీలకు 25శాతం వేతనాలు పెంచుతున్నట్లు న్యాయశాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. అప్పుడే ఏజీపీల వేతనం రూ.44వేల నుంచి రూ.55వేలకు పెరుగుతుందన్నారు. ఇటు జిల్లా కోర్టుల్లో పనిచేసే జీపీలు, ఏజీపీలకు కూడా జీతాలు పెంచనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు కోరినట్లు తెలిపారు మంత్రి.