డిజిటల్ చెల్లింపులు పెరిగినా చాలా మందికి నగదు అవసరం ఉంటుంది. దీంతో ఏటీఎంలకు వెళ్లి డబ్బును డ్రా చేసుకుంటున్నారు. ఇదే అదనుగా.. కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సహాయం చేస్తున్నట్లు నటించి పిన్ తెలుసుకొని, కార్డును మార్చి డబ్బు కాజేస్తున్నారు. సాంకేతిక సమస్యల పేరుతో మరో ఏటీఎంకు వెళ్లమని చెప్పి, బాధితులు వెళ్లగానే డబ్బు డ్రా చేస్తున్నారు.