ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏపీ గవర్నర్ కార్యాలయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు ఈసారైనా వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకీ వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వరుసగా 60 పనిదినాలు రాకపోతే డిస్ క్వాలిఫై అవుతారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరికల మధ్య .. వైసీపీ స్టాండ్ ఏంటనేదీ ఆసక్తికరంగా మారింది.