AP Assembly Money Theft Clarity: ఏపీ అసెంబ్లీలో ఈ నెల 2న ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, సోము వీర్రాజు, కొణిదెల నాగబాబు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో అసెంబ్లీ ఆవరణలో చోరీ జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై అసెంబ్లీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.. అక్కడ చోరీ జరగలేదన్నారు.