Raghurama Krishna Raju Advice To Mlas: ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్తో ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడటాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గమనించారు. అత్యవసర పరిస్థితి అయితే ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలని.. ఫోన్ను సభ్యులు సైలెంట్లో పెట్టుకోవాలని సూచించారు. ఇది విజ్ఞప్తి అని, విజ్ఞప్తులు ఒకటి రెండు సార్లు మాత్రమే ఉంటాయన్నారు.