AP Free Bus Scheme 750 New Electric Buses: రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలు 40 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవల ద్వారా రూ.200 కోట్ల ఆదాయం వచ్చిందని.. త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. పల్లెవెలుగు సర్వీసుల్లోనూ ఏసీ సౌకర్యం కల్పిస్తారని.. మెడికల్ అన్ఫిట్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. రవాణా రంగంలో అనేక మార్పులు రానున్నాయని చెప్పారు.