ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. కేబినెట్ కీలక తీర్మానం చేసింది. అదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ని సవరించాలని కూడా మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పలు ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు మంత్రివర్గం పరిపాలన అనుమతులు కల్పించింది. అదే సమయంలో పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా నిర్ణయం తీసుకుంది.