బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి సీఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం , శ్రీకాకుళం , కుప్పానికి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ నిధులు విడుదల, పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. అంతేకాకుండా, మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళలు రాత్రి వేళల్లో పనిచేసేందుకు వీలుగా చట్ట సవరణ చేశారు.