ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన 7,715 గ్రూపులుగా విభజించింది. ప్రతి గ్రూపులో ఇంజినీరింగ్/ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్వో/సర్వే అసిస్టెంట్, ఏఎన్ఎం తప్పనిసరిగా ఉంటారు. సాగు, ఇతర అవసరాల మేరకు అదనపు సిబ్బందిని నియమిస్తారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.