ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు అందింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ మీద కొంతమంది ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదుల గురించి మాట్లాడే సమయంలో పవన్ కళ్యాణ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని.. ముస్లింలను కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. చట్టపరంగా పవన్ కళ్యాణ్ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ఆ ధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.