ఏపీలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేయడంపై తెలంగాణలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది. విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఏపీలోని సంగీత, నృత్య కళాశాలల పరీక్షల నిర్వహణ, ఫీజుల వసూలుపై ఈ వివాదం నెలకొంది. తమ పరిధిలోని సంస్థలపై ఏపీ వర్సిటీ పెత్తనం చెల్లదని తెలంగాణ స్పష్టం చేయగా.. దీనిపై ప్రభుత్వపరంగా స్పందిస్తామని ఏపీ వీసీ వెల్లడించారు.