ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు అక్రమంగా వస్తున్న వడ్ల లారీలను అధికారులు గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించడంతో, ఏపీ దళారులు తక్కువ ధరకు అక్కడ ధాన్యం కొని వాటిని తెలంగాణకు తరలించి.. ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీనివల్ల దళారులు జేబుల్లోకి క్వింటాల్ మీద అదనంగా 820 లాభం వెళ్తుంది. దీని వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.