Vijayawada Bangalore Vande Bharat Express Proposal: ఆంధ్రప్రదేశ్ మీదుగా విజయవాడ నుండి బెంగళూరుకు వందేభారత్ రైలు నడపాలని ప్రతిపాదనలు వస్తున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు అనుసంధానంగా అమరావతి నుంచి ఈ రైలును నడపాలని భావిస్తున్నారు. ఈ రైలు అనంతపురం లేదా తిరుపతి మీదుగా వెళ్లే అవకాశం ఉంది, దీనిపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీని ద్వారా ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది, రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.