ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరు చేర్చడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి సహకరించిన ప్రధాని మోదీకి ఏపీ మంత్రివర్గం ధన్యవాదాలు తెలిపింది. సీఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, సంక్షేమ పథకాలపై కేబినెట్లో చర్చించారు. ఆపరేషన్ సిందూర్ను అభినందించారు. మున్సిపల్ శాఖ పనులకు, కేంద్రం వద్ద పెండింగ్ బిల్లుల ఉపసంహరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.