Andhra Pradesh High Temperatures Heat Waves: ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత మరింత పెరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు ఏకంగా 44.5 డిగ్రీలు నమోదవుతోంది. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. జనాలు ఎండలు, వేడిగాలులకు అల్లాడిపోతున్నారు.. ఇటు ఉక్కపోత దెబ్బకు ఇబ్బందిపడుతున్నారు. ఏపీ ప్రజల్ని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటక రావొద్దని సూచిస్తున్నారు.