దసరా పండగకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్తను అందించనుంది. పేద కుటుంబాలకు దసరా నాటికి గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశారు. మరోవైపు వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఆర్థిక సాయం కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50000, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75000 చొప్పున ఆర్థిక సాయం అందించింది.