Pawan Kalyan Mana Ooru Mata Manthi: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు! 'మన ఊరు - మాటా మంతి' పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలసలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకోనున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి!