ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి పాలనను మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే మన మిత్ర వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రెండు నెలల్లో అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేస్తామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.