ఏపీలో గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించారు.