Andhra Pradesh Govt Free Insurance To People: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించేందుకు సిద్ధమైంది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా బీమా పద్ధతిలో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్యం బీమా సంస్థ ద్వారా లభిస్తుంది. ఆ పైన ఖర్చును ఎన్టీఆర్ ట్రస్ట్ భరిస్తుంది. 26 జిల్లాలను రెండు భాగాలుగా చేసి బీమా కంపెనీలను ఎంపిక చేస్తారు. దాదాపు 1.43 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.