AP Rain Alert: రుతుపవనాలు ముందే వచ్చినా, ఆ తర్వాత వర్షాలు మాయమయ్యాయి. రైతులు ఆశగా ఎదురు చూస్తుండగా, అమరావతి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, మరో మూడు రోజులు తేలికపాటి నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.