ఆంధ్రప్రదేశ్లోని రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ తీపికబురు వినిపించింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఓ కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. నంద్యాల మీదుగా గుంతకల్లు - మార్కాపురం డైలీ ప్యాసిండర్ రైలు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మార్గంలో డైలీ ప్యాసింజర్ రైలు ప్రవేశపెట్టే ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని వెల్లడించింది.