Andhra Pradesh Basavatarakam Cancer Hospital: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని ప్రకటించారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి దామోదర రాజనర్సింహ ఆసుపత్రి సేవలను కొనియాడారు. కొత్తగా లీనియర్ యాక్సిలేటర్ రేడియో థెరపీ యంత్రాన్ని, క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించారు. అమరావతిలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.