మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం టిడ్కో నివాసాల వద్ద సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రజలతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పానకాల స్వామి గుడిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘మన ఇల్లు - మన లోకేష్’ కార్యక్రమంలో భాగంగా మరో 832 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.