Ap Dgp Harish Kumar Alert On Apk Files: ఆంధ్రప్రదేశ్ ప్రజలను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అప్రమత్తం చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్లపై క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. పీఎం కిసాన్, ఎస్బీఐ ఈకేవైసీ పేరుతో వచ్చే మోసపూరిత లింక్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ వస్తే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.