AP Govt Employees Pass Necessary Tests: ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు పొందాలంటే పరీక్షలు తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాల్లో ఐటీ నైపుణ్యాలు తప్పనిసరి అని, ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సరిగా అమలు కావడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీగా మారుస్తామని అధికారులు తెలిపారు.