శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తరలించుకుపోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే కేంద్రానికి ఫిర్యాదు చేయాలన్నారు. రానున్న మూడు నెలలు అత్యంత కీలకమని.. సాగు, తాగునీరు, విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.