AP Fact Check On PGECET 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష విధానాన్ని రద్దు చేస్తోందన్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. పీజీసెట్, ఈఏపీసెట్, ఐసెట్ కౌన్సిలింగ్ సకాలంలో జరుగుతున్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. డిగ్రీ ఫలితాలు ఆలస్యమైనా, ప్రవేశాల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యాశాఖ తెలిపింది.