Borra Gopi Murthy Returned Rs 1 Lakh Coupon: ఏపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం రూ.లక్ష విలువైన క్రోమా కూపన్లు అందజేశారు. అయితే అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కూపన్లు తీసుకున్నారు. కానీ పీడీఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి మాత్రం తనకు ఆ కూపన్ వద్దని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఆ కూపన్ వెనక్కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకు కారణాలు కూడా గోపిమూర్తి చెప్పుకొచ్చారు.