ఉద్యోగుల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లావాదేవీలు అన్నీ ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో జాప్యం ఉండదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.. 520 పోస్టుల భర్తీ ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.