AP Govt To Take Action On SSC Evaluation Errors: ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.. ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుంది. అయితే పదోతరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధించేలా పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లో తప్పులు చేసినా పెనాల్టీ విదించేలా ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు మార్కుల కౌంటింగ్లో తప్పులు జరగకుండా ట్యాబ్ల వినియోగిస్తారు.