వయో వృద్ధుల ఆరోగ్య బీమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పథకాన్ని రాష్ట్రంలో 70 ఏళ్లు, ఆపైన వారికి అందరికీ వర్తింపజేయాలని నిర్ణయించింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా పీఎంజేఏవై కింద రూ.5 లక్షల ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తూ ఏపీ ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి.కృష్ణబాబు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వయో వృద్ధులు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ఉపయోగించుకోవాలో లేదా ఈ పథకంలో చేరాలా అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.