ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 590 మంది వేదపండితులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. శనివారం ఏపీ దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో నిరుద్యోగులుగా ఉన్న 590 మంది వేదపండితులకు నెలకు రూ.3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ఆనం ప్రకటించారు.