Vijayawada To Hyderabad Seaplane Soon: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సీప్లేన్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. విజయవాడ నుండి శ్రీశైలం, హైదరాబాద్కు సీప్లేన్లను నడపాలని యోచిస్తోంది. దీని కోసం కృష్ణానది వద్ద ఏరోడ్రోమ్, శ్రీశైలం డ్యామ్, హుస్సేన్సాగర్ వద్ద సీప్లేన్ బేస్లను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ నుండి శ్రీశైలం కేవలం 50 నిమిషాల్లో, హైదరాబాద్కు గంటలో చేరుకోవచ్చు. టికెట్ ధర ఇంకా నిర్ణయించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం నుండి అనుమతి రావాల్సి ఉంది.