బందరు పోర్టు వచ్చే ఏడాదికి అందుబాటులోకి రానుందని ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తెలిపారు. 2026 అక్టోబర్ నాటికి బందరు పోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. రూ.5500 కోట్లతో నిర్మిస్తున్న ఈ పోర్టు ఏపీతో పాటు తెలంగాణ అవసరాలు మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల అవసరాలు కూడా తీరుస్తుందని ఆయన పేర్కొన్నారు. మొదటి దశలో 4 బెర్తులను పూర్తి చేస్తామని, పనుల్లో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. పూర్తి వివరాలు..