AP Government SIT on Liquor: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం దర్యాప్తునకు సిద్ధమైంది. 2019 నుంచి 2024 మధ్య మద్యం అక్రమాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ సిట్ ఏర్పాటైంది. మరోవైపు ప్రతి 15 రోజులకు ఓసారి దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్ను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే దర్యా్ప్తునకు సహకరించాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.