ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పోతుల సునీత కాషాయ కండువా కప్పుకున్నారు. పోతుల సునీత వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే 2024 ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని రోజులకు పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరతారని వార్తలు వచ్చినప్పటికీ ఆమె బీజేపీ గూటికి చేరారు.