ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కొద్దిలో ప్రమాదం తప్పింది. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం కృష్ణాపురంలో ఎంఎస్ఎంఈ పార్కుకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన వేదిక కూలిపోయింది. అదృష్టవశాత్తూ వేదికపై ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఏమీ కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేజి మీదకు ఒక్కసారిగా ఎక్కువమంది చేరుకోవటంతో ఈ ప్రమాదం జరిగింది.