మహిళల కోసం ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం తీసుకురానున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో లక్ష మంది మహిళలకు త్వరలోనే టైలరింగ్ మీద శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. టైలరింగ్ మీద శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత.. వారందరికీ కుట్టుమిషన్లు పంపిణీ చేస్తామన్నారు. కుట్టుమిషన్ల ద్వారా ఇంటి వద్ద నుంచే స్వయం ఉపాధి పొందేలా, మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఐదుగురు మంత్రుల బృందం ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించింది.